Sep 29, 2020

*నవంబరు 2 నుంచి స్కూళ్లు* *-ముఖ్యమంత్రి జగన్ వెల్లడి* (News from Media) *ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలలు నవంబరు 2 నుంచి తెరవాలని నిర్ణయించారు. రాష్ర్ట ముఖ్యమంత్రి జగన్ సైతం ఇదే విషయం స్పష్టం చేశారు. రాష్ర్టంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నవంబరు 2 నుంచి స్కూళ్లు తెరవాలని నిర్ణయించినట్లు స్పష్టంగా ప్రకటించారు. గతంలో అక్టోబరు 5న స్కూళ్లు తెరవాలని నిర్ణయించామని, కానీ ప్రస్తుతం ఆ నిర్ణయం మార్చుకున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అక్టోబరు 5న జగనన్న విద్యా కానుక అందిస్తామని , పాఠశాలలు తెరిచే లోపు విద్యార్థులు యూనిఫాం కుట్టించుకుంటారని ముఖ్యమంత్రి చెప్పారు.*