Oct 10, 2020

*బదిలీలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్* *ఉపాధ్యాయులకు శుభవార్త* *రెండు- మూడు రోజుల్లో ఉత్తర్వులు* *ఎట్టకేలకు ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ బదిలీలకు ఆమోదం లభించింది. దీనికి సంబంధించిన ఫైలు పై ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ సంతకం చేశారు. దీనిపై ఉత్తర్వులు రెండు మూడు రోజుల్లో వెలువడనున్నాయి. ఫిబ్రవరి 29 , 2020 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీలు కార్యక్రమం చేపడతారు. మూడు సంవత్సరాలుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు ఇది శుభవార్తే.* *-సన్నశెట్టి రాజశేఖర్, ఏపీటీఎఫ్, 94404 36703*